
KATHALA PARIMALALU
"ఆఖ్యాయికా, ఖండకథా,
పరికథా, కథా, కథానికేతి
మన్యం తే గద్య కావ్యంచపంచధా"
అని కథల్లోని రకాలను ఐదు భాగాలుగా వింగడిస్తారు. మన తొలి తెలుగు కథ గురజాడ అప్పారావు దిద్దుబాటు (1910) అన్నది తొలికథ అంటారు. నిజానికి కథ, కథానిక మనదే అయినా పాశ్చాత్య ప్రభావం వలన స్టోరి, షార్ట్ స్టోరి అనే విభేదాలు కూడా మనల్ని ప్రభావితం చేశాయి.నూతలపాటి నాగేశ్వరరావు సంపాదకత్వంలో వచ్చిన కథా పరిమళాలు ఒక వినూత్న ప్రయోగం. కథా రచనలు ప్రోత్సహించాలనే ఉత్తమ భావనతో అన్ని వయస్సుల, వర్గాల, రచనలు సేకరించడం ఒక సత్ప్రయత్నం. ముఖ్యంగా యువ తరాన్ని భావితరానికి నిలబెట్టే ఒక మంచి ప్రయత్నమీ కథా సంకలనం. ఇందులో సాంసారిక, ప్రేమ, సందేశాత్మక, సమస్యాత్మక, సరదా, వ్యంగ్యాత్మక, శాస్త్రీయ, విశ్లేషణలతో కూడిన కథలెన్నొ ఉన్నాయి. అన్ని విభిన్నధోరణులతో వింగడించినవి కనిపిస్తాయి. తొలి కథా విన్యాసం చేస్తున్నవారికి ఇది మంచి వేదిక. ఈ ప్రయత్నం వల్ల యువతరం వారి "లోనున్న" ఆలోచనకు అక్షరరూపం ఇచ్చే ప్రయత్నం ఒక భావి కథాపరిమళానికి ఆకరువు. మిత్రుడు నూతలపాటి నాగేశ్వరరావు గారి ప్రయత్నం సిద్ధించి పరిమళించిందని చెప్పాలి. సరికొత్త రచయితలకు మలితరం రచనలు తోడయితే మరింత పరిమళసౌరభం గుభాళిస్తుంది. ఇక్కడ అదే జరిగింది."శుభమేవ యత్నం
ప్రయత్నం ఉత్తమలక్షణం"
- ISBN
- 9788197447556
- Språk
- Telugu
- Vikt
- 310 gram
- Utgivningsdatum
- 2024-12-05
- Förlag
- Kasturi VIjayam
- Sidor
- 274
